Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 7, 2026Short Read
ఏపీకి వర్ష సూచన: ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం!
ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు కాకినాడ, కోనసీమ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఆయా జిల్లాల ప్రజలు, రైతులు, మరియు కూలీలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని హెచ్చరించింది.



