Skip to main content
QuickToday News

QuickToday Shorts

Bite-sized summaries for the modern reader. Perfect for staying informed when you only have a few minutes.

సీటు రాలేదని IIT వెబ్‌సైట్ హ్యాక్ చేసిన యువకుడు... చివరికీ ట్విస్ట్ ఏంటంటే!
National
30 Jul 2026

సీటు రాలేదని IIT వెబ్‌సైట్ హ్యాక్ చేసిన యువకుడు... చివరికీ ట్విస్ట్ ఏంటంటే!

క్విక్ టుడే న్యూస్, జులై 30 :- ఐఐటీ కాన్పూర్‌లో సైబర్ సెక్యూరిటీ కోర్సులో సీటు దక్కకపోవడంతో ఒక విద్యార్థి ఏకంగా ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌నే హ్యాక్ చేశాడు. అందులో 'నాకు ఒక సరైన అవకాశం ఇవ్వండి' అంటూ పోస్ట్ చేశాడు.అయితే ఈ ఘటనపై కేసు పెట్టడానికి ఐఐటీ డైరెక్టర్ నిరాకరించడం విశేషం. సదరు యువకుడి హ్యాకింగ్ నైపుణ్యాన్ని, సాంకేతిక ప్రతిభను గుర్తించిన డైరెక్టర్.. అతడికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. యువకుడి స్కిల్స్‌ను పరీక్షించేందుకు మరోసారి ప్రత్యేక టెస్ట్ నిర్వహిస్తామని, అందులో అతని ప్రతిభ ఆధారంగా వచ్చే ఏడాది సీటు కేటాయింపుపై పరిశీలిస్తామని వెల్లడించారు.

View
టీటీడీ నకిలీ వెబ్‌సైట్ల పట్ల జర భద్రం..!
Andhra Pradesh
View
తెలంగాణలో వర్షాల హోరు.. స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్!
Telangana
30 Jul 2026

తెలంగాణలో వర్షాల హోరు.. స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్!

క్విక్ టుడే న్యూస్, జులై 30 :- తెలంగాణలోని పలు జిల్లాల్లో గత మూడ్రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల రహదారులు జలమయమై ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ మరోసారి అత్యంత భారీ వర్ష హెచ్చరికలు జారీ చేయడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరిగింది.ఇప్పటికే కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ఇవ్వగా, పిల్లల భద్రతే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు ప్రభుత్వం వెంటనే అధికారికంగా సెలవు ప్రకటించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

View
జూరాలకు భారీ వరద: 10 గేట్లు ఎత్తివేత!
Telangana
30 Jul 2026

జూరాలకు భారీ వరద: 10 గేట్లు ఎత్తివేత!

క్విక్ టుడే న్యూస్, జులై 30 :- ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదలతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు, రిజర్వాయర్ భద్రతను దృష్టిలో ఉంచుకుని 10 గేట్లను ఎత్తివేశారు. ఈ గేట్ల ద్వారా నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. కాగా, ఈ సీజన్‌లో జూరాల ప్రాజెక్టు స్పిల్ వే గేట్లను తెరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

View
బ్యాక్‌లాగ్ ఉన్న వారి కోసం కాక‌తీయ వ‌ర్సిటీ మరో అవకాశం
General
30 Jul 2026

బ్యాక్‌లాగ్ ఉన్న వారి కోసం కాక‌తీయ వ‌ర్సిటీ మరో అవకాశం

హనుమకొండ, జూలై30(క్విక్ టుడే న్యూస్‌):

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్ణీత కాలవ్యవధిలో తమ డిగ్రీ లేదా పీజీ కోర్సులను పూర్తి చేయలేక బ్యాక్‌లాగ్‌లు మిగిలిపోయిన పూర్వ విద్యార్థులకు 2026–27 విద్యాసంవత్సరానికి తుది అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు థియరీ, ప్రాక్టికల్, ప్రాజెక్ట్ వర్క్, సెమినార్ తదితర పరీక్షలకు దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న సబ్జెక్టులను పూర్తి చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం యూనివర్సిటీ రిజిస్ట్రార్ నుంచి ప్రత్యేక అనుమతి పొందడంతో పాటు నిర్దేశించిన పరీక్షా రుసుములను చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. యూజీ, పీజీ విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న బ్యాచ్‌లతో కలిసి పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. అవసరమైతే పీజీ విద్యార్థులు ఎస్డీఎల్సీఈ నిర్వహించే పరీక్షలతో పాటు ప్రత్యేక అనుమతి పొంది పరీక్షలు రాయవచ్చన్నారు. అర్హులైన పూర్వ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

View
మణుగూరు లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు...
General
30 Jul 2026

మణుగూరు లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు...

మాదక ద్రవ్యాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు...

భద్రాద్రి జిల్లా ప్రతినిధి,( క్విక్ టు డే న్యూస్).

మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల పరిసరాలు మరియు పాన్ షాపుల్లో కొత్తగూడెం హెడ్‌క్వార్టర్స్ నుండి వచ్చిన డాగ్ స్క్వాడ్ బృందం ఆధ్వర్యంలో బుదవారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు మణుగూరు టౌన్ ఎస్సై రావూఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వం నిషేధించిన గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయా అనే ఉద్దేశంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారని అన్నారు. ఈ తనిఖీల్లో ఎటువంటి నిషేధిత మాదక పదా ర్థాలు లభించ లేదు. విద్యార్థులు, షాపు యజమాను లకు మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం చట్టరీత్యా నేరమని, అవగాహన కల్పించి,అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసు లకు తెలియజేయాలని సూచించా రు.ఈ కార్యక్రమం లో డాగ్ స్కాడ్ సిబ్బంది, మణుగూరు పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

View
జీవ వైవిధ్యంలో పులుల పాత్ర కీలకం :  ఏపీ డిప్యూటీ సీఎం పవన్
General
30 Jul 2026

జీవ వైవిధ్యంలో పులుల పాత్ర కీలకం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్

అమరావతి, జూలై29(క్విక్ టుడే న్యూస్‌):

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రకృతి, అటవీ సంరక్షణకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. పులుల సంరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తోందని, తూర్పు కనుమల్లో పులుల పునరావాసానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నల్లమల అడవుల్లో పులుల మనుగడను శాశ్వతంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పులి కేవలం జాతీయ జంతువు మాత్రమే కాకుండా అటవీ సంపద, పర్యావరణ సమతుల్యతకు ప్రతీక అని స్పష్టం చేశారు. 2010లో ప్రారంభమైన ప్రపంచ పులుల దినోత్సవం సంరక్షణ అవసరాన్ని గుర్తుచేస్తోందన్నారు. ‘ప్రాజెక్ట్ టైగర్’ వంటి కార్యక్రమాల ఫలితంగా ప్రపంచంలోని దాదాపు 75 శాతం పులులు భారత్‌లోనే ఉన్నాయని, ఇది దేశం సాధించిన విశిష్ట పర్యావరణ విజయమని పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

View
భ‌ద్ర‌కాళి ఆల‌యంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం
General
30 Jul 2026

భ‌ద్ర‌కాళి ఆల‌యంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం

వరంగల్, జూలై29(క్విక్ టుడే న్యూస్‌):

వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి శాకంబరి దేవి రూపంలో దర్శనమిచ్చారు. ఈ అపూర్వ అలంకరణను తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని క్యూలైన్లలో నిలబడి దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, నైవేద్యాలు నిర్వహించిన అర్చకులు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగింది. భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

View
వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం
General
30 Jul 2026

వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం

అధికార పార్టీ తీరుకు నిరసనగా విపక్షాల వాకౌట్

న్యూఢిల్లీ, జూలై29):

రాజ్యసభలో వందేమాతరం బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఇటీవల సభలో ప్రవేశపెట్టగా, చర్చ అనంతరం ఆమోదించారు. వందేమాతరాన్ని అవమానించడం లేదా ఆలాపనకు ఆటంకం కల్పించడం నేరంగా పరిగణించేలా జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం–1971లో సవరణలు చేయనున్నారు. ప్రస్తుతం జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ విస్తరించడమే ఈ బిల్లు లక్ష్యం. చర్చ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యల అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ పదేపదే విజ్ఞప్తి చేసినా ఆందోళనలు కొనసాగడంతో, కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బిల్లు ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

View
7,437 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌
Telangana
30 Jul 2026

7,437 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌

సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీసు, జైళ్ల శాఖ‌ల్లో పోస్టుల భ‌ర్తీ

హైదరాబాద్, జూలై29(క్విక్ టుడే న్యూస్‌):

తెలంగాణ పోలీసు శాఖలో 7,437 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. రాష్ట్ర పోలీసు నియామక మండలి ప్రకారం సివిల్, ఏఆర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్ కానిస్టేబుల్ 3,697, ఏఆర్ కానిస్టేబుల్ 1,052, ఎస్‌పీఎఫ్‌లో ఎస్సై 44, కానిస్టేబుల్ 1,380 పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, ఫైర్ రైటర్ 751, జైళ్ల శాఖలో 223 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామని, షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తుకు ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న శారీరక, వైద్య అర్హతలను సివిల్ సర్జన్‌తో పరీక్షించుకోవాలని సూచించారు. ఎస్సీ అభ్యర్థులు ఉపకుల వర్గీకరణ స్పష్టంగా ఉన్న కుల ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని నియామక మండలి పేర్కొంది.

View
గూడూరులో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా
Telangana
29 Jul 2026

గూడూరులో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా

శివ్వంపేట, జులై 29 (క్విక్ టుడే న్యూస్):

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీగురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీదత్తాత్రేయ స్వామి, శ్రీసమర్థ సద్గురు షిరిడి సాయినాథ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పెద్దగోని శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలోనే తొలి దత్తపంచాయతనం నిర్మాణమే తమ లక్ష్యమని తెలిపారు. గురుపీఠం భవిష్యత్తులో ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సర్పంచ్ బ్యాగరి నర్సయ్య, గ్రామ పెద్దలు, ట్రస్ట్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

View
వాయుగుండం ప్రభావం.. తెలంగాణ‌లో మూడు రోజులపాటు భారీ వర్షాలు
General
29 Jul 2026

వాయుగుండం ప్రభావం.. తెలంగాణ‌లో మూడు రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్, జూలై 29:

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ ప్రాంతాల వైపు పయనిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో వచ్చే మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతుండటంతో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో ములుగు, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారంలో అత్యధికంగా 9.64 సెం.మీ. వర్షం కురిసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. గురు, శుక్రవారాల్లోనూ బలమైన గాలులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

View
మహిళా కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులు
General
29 Jul 2026

మహిళా కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులు

విజయవాడ, జూలై 29 (క్విక్ టుడే న్యూస్):

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు జోగి రమేశ్ కుటుంబ సభ్యులు తమను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించారు. వరకట్న వేధింపులు, గృహహింస, హత్యాయత్నం ఆరోపణలకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన మహిళా కోర్టు, కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేశ్ పెద్ద కోడలు జోగి మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం, గృహహింస, వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో జోగి రమేశ్‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు.

View
36 గంటలు అప్రమత్తంగా ఉండండి...
General
29 Jul 2026

36 గంటలు అప్రమత్తంగా ఉండండి...

కలెక్టర్ అంకిత్ భారీ వర్షాలపై కలెక్టర్ హెచ్చరిక...


భద్రాద్రి జిల్లా ప్రతినిధి, జులై28 ( క్విక్ టు డే న్యూస్).

రానున్న 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అధికారులు కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వాగులు, వంకలు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లొద్దని, నీటి ప్రవాహాన్ని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

View
బీఎల్‌ఏలు పార్టీకి వెన్నెముకలా పనిచేయాలి
General
29 Jul 2026

బీఎల్‌ఏలు పార్టీకి వెన్నెముకలా పనిచేయాలి

తొర్రూరు మండల,పట్టణ బీఎల్‌ఏలకు ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి దిశానిర్దేశం

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొర్రూరు మండల,పట్టణ బిఎల్ఏ ఏజెంట్లతో ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం,ఓటరు జాబితా సవరణలు,క్షేత్రస్థాయిలో సమన్వయం వంటి అంశాలపై బీఎల్‌ఏలకు ఆమె దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....ప్రతి బూత్‌లో పార్టీ కార్యక్రమాలను మరింత చురుకుగా నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.కొత్తగా ఓటు హక్కు పొందిన అర్హుల పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయడంతో పాటు,తప్పులు,మార్పులు,చేర్పులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.పార్టీ బలోపేతంలో బీఎల్‌ఏలపాత్ర కీలకమని,ప్రతి బూత్‌లో సమన్వయంతో పనిచేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీంద్ర చారి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముద్దసాని సురేష్,పార్టీ నాయకులు,మండల పట్టణ ఇంచార్జిలుబీఎల్‌ఏలు,ప్రజాప్రతినిధులు,
కార్యకర్తలు పాల్గొన్నారు.

View
టాలీవుడ్ అగ్ర హీరోలకు గాయాల గండం.. ఆందోళనలో అభిమానులు!
Telangana
29 Jul 2026

టాలీవుడ్ అగ్ర హీరోలకు గాయాల గండం.. ఆందోళనలో అభిమానులు!

క్విక్ టుడే న్యూస్, జులై 29 :- టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడుతుండటం అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఇటీవల ముంబైలో సర్జరీ జరిగింది. 'NBK 111' యాక్షన్ సన్నివేశాల్లో గాయపడిన బాలకృష్ణ మోకాలికి, అలాగే 'పెద్ది' మూవీ సెట్స్‌లో గాయపడిన రామ్ చరణ్ మణికట్టుకు కూడా ఆపరేషన్లు జరిగాయి. తాజాగా 'డ్రాగన్' సినిమా షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సైతం తీవ్ర గాయమై విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకేసారి ఈ స్టార్ హీరోలంతా ఆసుపత్రుల పాలుకావడంతో సోషల్ మీడియాలో 'గెట్ వెల్ సూన్' ట్రెండ్ అవుతోంది. సినిమా షూటింగ్స్ లో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో హీరోల భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

View
ఎమ్మెల్యే పాయం ను కలిసిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎస్‌కే ఖదీర్...
General
29 Jul 2026

ఎమ్మెల్యే పాయం ను కలిసిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎస్‌కే ఖదీర్...


పినపాక ఆర్ సీ జులై 28,( క్విక్ టు డే న్యూస్).

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎస్‌కే ఖదీర్ జన్మదిన వేడుకల సందర్భంగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి పుష్పగుచ్ఛం అందించి ఆశీస్సులు పొందారు.
అనంతరం ఎమ్మెల్యే ఎస్‌కే ఖదీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేస్తూ, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

View
సామాన్యులకు షాక్ : భారీగా పెరగనున్న ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు
Telangana
29 Jul 2026

సామాన్యులకు షాక్ : భారీగా పెరగనున్న ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు

క్విక్ టుడే, తెలంగాణ :- ఆగస్టు నెల నుంచి సామాన్యులకు మరో షాక్ తగలనుంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల కారణంగా రిఫ్రిజిరేటర్లు, టీవీలు, దుస్తులు, ప్యాసింజర్ వెహికల్స్, ప్యాకేజ్డ్ టీ, హెయిర్ ఆయిల్ వంటి పలు రకాల ఉత్పత్తుల ధరలు 6-8% పెరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

ముఖ్యంగా టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లపై 4-6%, నిత్యావసరాలపై 3-5% వరకు ధరల పెంపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే, మారుతి సుజుకీ (మోడల్‌ను బట్టి రూ.30 వేల వరకు), హోండా కార్స్ వంటి ఆటోమొబైల్ కంపెనీల వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల పెరుగుదల వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టనుంది.

View
తెలుగు రాష్ట్రాల్లో నేడు దంచికొట్టనున్న భారీ వర్షాలు!
Telangana
29 Jul 2026

తెలుగు రాష్ట్రాల్లో నేడు దంచికొట్టనున్న భారీ వర్షాలు!

క్విక్ టుడే, జులై 29:- తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.అటు ఏపీలోనూ అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం, మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

View
శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు!
Andhra Pradesh
29 Jul 2026

శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు!

క్విక్ టుడే న్యూస్, జులై 29 :- ఎగువ రాష్ట్రాలైన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండటంతో కృష్ణమ్మ దిగువన ఉన్న శ్రీశైలం వైపు పరవళ్లు తొక్కుతోంది. ఈ జలాశయాల నుంచి 80వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు.దీంతో తెలంగాణలోని గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు కృష్ణా నీరు చేరుతోంది. జూరాల విద్యుత్ కేంద్రం నుంచి 37వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ప్రవాహం ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

View
HomeShortsePaperProfile