Skip to main content

QuickToday Shorts

Bite-sized summaries for the modern reader. Stay informed in seconds.

10టీవీ రిపోర్టర్ కుటుంబంలో తీవ్ర విషాదం:
District
9 Sept 2026

10టీవీ రిపోర్టర్ కుటుంబంలో తీవ్ర విషాదం:

పరామర్శించిన ప్రముఖులు

జ‌న‌గామ‌, సెప్టెంబర్ 08 (క్విక్ టుడే న్యూస్‌):
జనగామ 10టీవీ ప్రతినిధి మాచర్ల ఆశిష్ తండ్రి రెండు రోజుల క్రితం అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త తెలుసుకున్న పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఆశిష్ నివాసానికి చేరుకుని, ఆయన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ? ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బాలమణి శ్రీనివాస్, కౌన్సిలర్లు రామగళ్ల విజయ్, కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్, భారత్వజ్ తదితరులు శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆత్మీయ వియోగానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఈ కష్టసమయంలో బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Read
పీర్జాదిగూడ కమాన్ వద్ద చిక్కుకున్న భారీ గణనాథుడు
Telangana
9 Sept 2026

పీర్జాదిగూడ కమాన్ వద్ద చిక్కుకున్న భారీ గణనాథుడు

పీర్జాదిగూడ, సెప్టెంబర్‌ 9 (క్విక్ టుడే న్యూస్‌):

ఉప్పల్‌ నుంచి పీర్జాదిగూడకు తరలిస్తున్న భారీ గణనాథుడి విగ్రహం బుధవారం పీర్జాదిగూడ కమాన్‌ వద్ద చిక్కుకుంది. విగ్రహానికి ఉన్న భారీ కిరీటం కమాన్‌కు తగలడంతో ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనను పరిష్కరించేందుకు నిర్వాహకులు తీవ్రంగా శ్రమించారు. చివరకు క్రేన్‌ సాయంతో కిరీటంలోని కొంత భాగాన్ని తొలగించి గణనాథుడిని అక్కడి నుంచి బయటకు తరలించారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగడంతో దాదాపు మూడున్నర గంటలకు పైగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ విగ్రహాలను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ఇప్పటికే మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Read
కాళోజీ స్పూర్తితో యువత పోరాడాలి: కేసీఆర్ పిలుపు
Telangana
9 Sept 2026

కాళోజీ స్పూర్తితో యువత పోరాడాలి: కేసీఆర్ పిలుపు

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పాలకుల అన్యాయాలను, దుర్నీతిని ప్రశ్నిస్తున్న యువతకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.పాలకుల అక్రమాలపై గళమెత్తడమే ప్రజాకవి కాళోజీకి ఇచ్చే నిజమైన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు. సమాజంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువత రాజీలేని పోరాటాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Read
పసుపు నీళ్ల శుద్ధి వివాదం: సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Telangana
9 Sept 2026

పసుపు నీళ్ల శుద్ధి వివాదం: సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలోని వరదరాజ్ రోడ్డును బీఆర్‌ఎస్ (BRS) నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.అంతకుముందు ఎస్సీ (SC) సంఘాలు ఆ ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపట్టడం వల్లనే, బీఆర్‌ఎస్ నేతలు ఆ ప్రదేశాన్ని శుద్ధి చేశారని కాంగ్రెస్ పార్టీ (INC) తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది బహిరంగంగా జరిగిన కుల వివక్షేనని టీపీసీసీ (TPCC) అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. "అంటరానితనం గురించి ఇప్పటివరకు పుస్తకాల్లోనే చదివాము, కానీ నేడు సమాజంలో ప్రత్యక్షంగా కళ్లారా చూస్తున్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read
బోల్డ్ సీన్స్‌పై విమర్శలొస్తే నాదే బాధ్యత: వైష్ణవికి డైరెక్టర్ ఆదిత్య హాసన్ భరోసా!
General
9 Sept 2026

బోల్డ్ సీన్స్‌పై విమర్శలొస్తే నాదే బాధ్యత: వైష్ణవికి డైరెక్టర్ ఆదిత్య హాసన్ భరోసా!

'EPIC' సినిమాలో బోల్డ్ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ వైష్ణవి నర్వస్‌గా ఫీలయ్యారని దర్శకుడు ఆదిత్య హాసన్ తెలిపారు. ఇటీవల జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో వైష్ణవి చేసిన క్యారెక్టర్‌పై ఎలాంటి నెగెటివిటీ లేదా విమర్శలు వచ్చినా తాను సపోర్ట్‌గా నిలిచి పూర్తి బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు.

గతంలో 'బేబీ' మూవీలోని పాత్ర కారణంగా వైష్ణవి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బోల్డ్ సీన్స్‌పై ట్రోలింగ్ పెరుగుతున్న నేపథ్యంలో, హీరోయిన్‌కి ధైర్యం చెప్తూ డైరెక్టర్ ఆదిత్య ఇచ్చిన భరోసా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read
నాకు బెదిరింపులు వస్తున్నాయి.. దేనికైనా సిద్ధమే: జనసేన నేత, నటుడు తనీష్!
Andhra Pradesh
9 Sept 2026

నాకు బెదిరింపులు వస్తున్నాయి.. దేనికైనా సిద్ధమే: జనసేన నేత, నటుడు తనీష్!

తనకు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని జనసేన నేత, నటుడు తనీష్ తెలిపారు. ‘సీతక్క గురించి మాట్లాడేంత పెద్దోడివా’ అంటూ కొందరు పెట్టిన అసభ్యకర మెసేజ్‌ను ఆయన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ విషయమై తనీష్ స్పందిస్తూ.. "జనసేన జెండా చేతిలోకి తీసుకున్నప్పుడే నేను పోరాటానికి సిద్ధమయ్యాను. ఒక ఆదివాసీ ఆడబిడ్డకు న్యాయం జరగాలనే ప్రయత్నిస్తున్నాను. దీనిని వ్యక్తిగతంగా తీసుకుని బెదిరింపులకు దిగితే ఊరుకోను. ఇసుక మాఫియా నుంచి కమిషన్ కాంట్రాక్ట్ల దందాల వరకు అన్ని అక్రమాలను బయటపెడతాను" అని తీవ్రంగా హెచ్చరించారు.

Read
Sponsored Ad
ఏపీలో గణేష్ మండపాలకు బిగ్ రిలీఫ్.. ఉచిత కరెంట్ సరఫరా: మంత్రి నారా లోకేష్!
Andhra Pradesh
9 Sept 2026

ఏపీలో గణేష్ మండపాలకు బిగ్ రిలీఫ్.. ఉచిత కరెంట్ సరఫరా: మంత్రి నారా లోకేష్!

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చతుర్థి వేడుకలు జరుపుకుంటున్న భక్తులకు, ఉత్సవ కమిటీలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రజలందరూ వేడుకలను మరింత ఉత్సాహంగా, వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ గణనాథుడి దివ్య ఆశీస్సులు ప్రతి కుటుంబంపైనా ఉండాలని, అందరికీ సంతోషం, విజయం కలగాలని లోకేష్ ఆకాంక్షించారు.ప్రభుత్వం తీసుకున్న ఈ ఉచిత విద్యుత్ నిర్ణయం పట్ల ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read
తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వరుసగా 3 రోజులు పండగ సెలవులు!
General
9 Sept 2026

తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వరుసగా 3 రోజులు పండగ సెలవులు!

తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాంతంలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.


సెప్టెంబర్ 12 (రెండో శనివారం): సాధారణ ప్రభుత్వ సెలవు.


సెప్టెంబర్ 13 (ఆదివారం): వారపు సెలవు.


సెప్టెంబర్ 14 (సోమవారం) వినాయక చవితి పండుగ సెలవు.


వరుసగా మూడు రోజులు హాలిడేస్ రావడంతో పండగ కోసం సొంత ఊళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు, ఉద్యోగులు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు వినాయక చవితి వేడుకల కోసం పలు ప్రాంతాల్లో స్థానికులు గణేష్ మండపాల ఏర్పాటు పనుల్లో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా విగ్రహాల నిమజ్జనం రోజున కూడా ఆయా ప్రాంతాల వారీగా స్థానిక సెలవు ఇచ్చే అవకాశం ఉంది.

Read
సమస్యలు తెచ్చిపెట్టే చిన్న అలవాట్లు.. డాక్టర్ల హెచ్చరిక!
General
9 Sept 2026

సమస్యలు తెచ్చిపెట్టే చిన్న అలవాట్లు.. డాక్టర్ల హెచ్చరిక!

మనం రోజూ చేసే కొన్ని చిన్న పొరపాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే:

1.టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పేగులకు హాని కలుగుతుంది.

2. నీరు తక్కువగా తాగితే కిడ్నీలకు ముప్పు.

3.వ్యాయామం నిర్లక్ష్యం చేయడం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం.

4.రోజూ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.

5. ఇయర్ ఫోన్స్ అధికంగా వాడటం వల్ల చెవులకు నష్టం జరుగుతుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చెడు అలవాట్లను వెంటనే మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read
కోవిడ్ వ్యాక్సిన్ అపోహలు: వైద్యుల స్పష్టీకరణ
General
9 Sept 2026

కోవిడ్ వ్యాక్సిన్ అపోహలు: వైద్యుల స్పష్టీకరణ

కోవిడ్ వ్యాక్సిన్ల వల్లే యువతలో గుండెపోటు వస్తుందన్న వాదనలను వైద్యులు కొట్టిపారేశారు. 2021-22లో వేసుకున్న వ్యాక్సిన్ల వల్ల ఎటువంటి ప్రమాదం లేదని, పైగా అవి గుండె సమస్యల ముప్పును తగ్గిస్తాయని తేల్చిచెప్పారు.గుండెపోటుకు అసలైన కారణాలు వేరే ఉన్నాయని వైద్యులు వివరించారు. రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం, వాయు కాలుష్యం, మరియు వారానికి 55 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల స్ట్రోక్ ప్రమాదం 35% వరకు పెరుగుతుందని వారు వెల్లడించారు. కాబట్టి వ్యాక్సిన్ల పట్ల భయాందోళనలు వీడి, సరైన జీవనశైలిని పాటించడం ముఖ్యం.

Read
సామాన్యుడికి షాక్: భగ్గుమంటున్న చక్కెర, వంటనూనె ధరలు
National
9 Sept 2026

సామాన్యుడికి షాక్: భగ్గుమంటున్న చక్కెర, వంటనూనె ధరలు

సామాన్యులపై నిత్యావసరాల ధరల భారం తీవ్రంగా పడుతోంది. హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లోని కిరాణా దుకాణాల్లో కిలో చక్కెర ధర ఏకంగా రూ. 100కి చేరుకోగా, ఆన్‌లైన్ మరియు సూపర్ మార్కెట్లలో రూ. 75 నుంచి రూ. 80 వరకు విక్రయిస్తున్నారు.మరోవైపు వంటనూనె ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆన్‌లైన్‌లో లీటర్ వంటనూనె బాటిల్ ధర రూ. 202 కాగా, ప్యాకెట్ ధర రూ. 182గా ఉంది. అయితే స్థానిక కిరాణా షాపుల్లో ఈ ధరల కంటే అదనంగా మరో రూ. 5 నుంచి రూ. 10 వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. అమాంతం పెరిగిన ఈ ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read
ఆ చీకటి రోజులకు మూడేళ్లు: చంద్రబాబుకు అండగా నిలిచిన తెలుగు జాతికి లోకేష్ ధన్యవాదాలు
Andhra Pradesh
9 Sept 2026

ఆ చీకటి రోజులకు మూడేళ్లు: చంద్రబాబుకు అండగా నిలిచిన తెలుగు జాతికి లోకేష్ ధన్యవాదాలు

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున నారా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసుల్లో నిర్బంధించారని మంత్రి నారా లోకేష్ గుర్తుచేసుకున్నారు. ఆ చీకటి రోజులను తలచుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ కష్టకాలంలో 'నిజం గెలవాలి' అంటూ తెలుగు జాతి మొత్తం చంద్రబాబుకు అండగా నిలబడిందని ఆయన కొనియాడారు.అంతిమంగా ఆ పోరాటంలో నిజమే గెలిచిందని, అక్రమ కేసులను కోర్టులు సైతం కొట్టివేశాయని లోకేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్బంధం నుంచి బయటకు రావడం ధర్మం సాధించిన విజయమని పేర్కొన్నారు. నాడు తమకు కొండంత అండగా నిలిచి, మద్దతు తెలిపిన యావత్ తెలుగు జాతికి ఈ సందర్భంగా లోకేష్ మరోసారి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Read
Sponsored Ad
వాటర్ బాటిల్‌పై రూ.7 దోపిడీ.. షాపు యజమానికి రూ.7 లక్షల భారీ జరిమానా!
Andhra Pradesh
9 Sept 2026

వాటర్ బాటిల్‌పై రూ.7 దోపిడీ.. షాపు యజమానికి రూ.7 లక్షల భారీ జరిమానా!

కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ ప్రాంగణంలోని ఒక షాపులో వాటర్ బాటిల్‌ను MRP కంటే ఎక్కువకు విక్రయించినందుకు యజమానికి భారీ జరిమానా పడింది. పిఠాపురానికి చెందిన వెంకటేశ్వరరావు రూ.18 విలువైన బాటిల్ కొనగా, షాపు నిర్వాహకుడు రూ.25 వసూలు చేశాడు. దీనిపై బాధితుడు కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఫోరం.. అదనంగా తీసుకున్న రూ.7 తిరిగి ఇవ్వడంతో పాటు, కోర్టు ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది. అలాగే, వినియోగదారుల సంక్షేమ నిధికి ఏకంగా రూ.7 లక్షలు జరిమానాగా కట్టాలని యజమానిని ఫోరం ఆదేశించింది.

Read
2026 టాలీవుడ్‌కి 'గోల్డెన్ ఇయర్'.. వరుస బ్లాక్‌బస్టర్లే లక్ష్యంగా 'ఆపరేషన్ TFI': విజయ్ దేవరకొండ
General
9 Sept 2026

2026 టాలీవుడ్‌కి 'గోల్డెన్ ఇయర్'.. వరుస బ్లాక్‌బస్టర్లే లక్ష్యంగా 'ఆపరేషన్ TFI': విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాకు 2026 ఒక గ్రేట్ ఇయర్ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. 'ఎపిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్ నుంచి వరుసగా భారీ చిత్రాలు రాబోతున్నాయని, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ తర్వాత మరో బ్లాక్‌బస్టర్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.'ఎపిక్' తర్వాత నాని 'ప్యారడైజ్', తన తదుపరి చిత్రం 'రణబలి', రష్మిక 'మైనా', తరుణ్ భాస్కర్ 'ENE-2', ప్రభాస్ 'ఫౌజీ', బాలకృష్ణ 'దాదా' వంటి క్రేజీ సినిమాలు విడుదల కానున్నాయని ఆయన తెలిపారు. వీటిలో నాలుగు సినిమాల కంటెంట్ తనకు ముందే తెలుసని చెప్పిన విజయ్, ఈ వరుస విజయాల పరంపరను "ఆపరేషన్ TFI"గా అభివర్ణించారు.

Read
ఆకాశాన్నంటుతున్న సొంతింటి ఖర్చు: 4 ఏళ్లలో 59% పెంపు
National
9 Sept 2026

ఆకాశాన్నంటుతున్న సొంతింటి ఖర్చు: 4 ఏళ్లలో 59% పెంపు

2021-2025 మధ్య దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఏకంగా 59% పెరిగాయని అనరాక్ (Anarock) రీసెర్చ్ వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం భూముల రేట్లు భారీగా పెరగడమే. దేశవ్యాప్తంగా భూముల విలువలలో 50% నుండి 120% వరకు వృద్ధి నమోదైంది. అలాగే నిర్మాణ వ్యయం కూడా 34% మేర పెరిగింది.2021లో చదరపు అడుగుకి రూ.2,681గా ఉన్న నిర్మాణ ఖర్చు, 2025 నాటికి రూ.3,604 కి చేరుకుంది. ఇటీవల ఇరాన్-యూఎస్ (Iran-US) ఉద్రిక్తతల ప్రభావం కారణంగా నిర్మాణ వ్యయం అదనంగా మరో 8-10% పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.

Read
APలో ద్రోణి ప్రభావం: పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
Andhra Pradesh
9 Sept 2026

APలో ద్రోణి ప్రభావం: పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!

ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అలాగే అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Read
నేను మోసగాడిని కాదు.. భారత్‌కు రాకపోవడానికి కారణం అదే: విజయ్ మాల్యా
International
9 Sept 2026

నేను మోసగాడిని కాదు.. భారత్‌కు రాకపోవడానికి కారణం అదే: విజయ్ మాల్యా

తనపై మీడియా మోసగాడిగా ముద్ర వేయడం సరికాదని ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా అన్నారు. DRT ఉత్తర్వుల ప్రకారం తాను చెల్లించాల్సిన మొత్తం రూ.10,230 కోట్లు కాగా, బ్యాంకులు ఏకంగా రూ.14,131 కోట్ల ఆస్తులను జప్తు చేశాయని ఆయన తెలిపారు. రివర్స్‌లో తనకే రూ.6,722 కోట్లు రీఫండ్ రావాల్సి ఉందని, దీనిపై మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

1992 నుంచి తాను లండన్‌లో (UK) శాశ్వత నివాసంగా ఉంటున్నానని చెప్పారు. చట్టపరంగా యూకేను వదిలి వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నందునే తాను భారతదేశానికి రాలేకపోతున్నానని విజయ్ మాల్యా వివరణ ఇచ్చారు.

Read
అక్రమ నిర్మాణాల మారణహోమం: 5 ఏళ్లలో 33 వేల మంది బలి!
International
9 Sept 2026

అక్రమ నిర్మాణాల మారణహోమం: 5 ఏళ్లలో 33 వేల మంది బలి!

అక్రమ అనుమతులు, నాణ్యతా లోపాలతో నిర్మిస్తున్న భవనాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇటీవల హైదరాబాద్, ఢిల్లీల్లో భవనాలు కూలి 9 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. భవనాలు కూలడం, అగ్నిప్రమాదాలు, మ్యాన్‌హోళ్లలో పడటం వంటి ప్రమాదాల వల్ల 2020-24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 33,000 మందికి పైగా మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషాదకర ఘటనలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే జరుగుతుండటం గమనార్హం. అధికారులు తక్షణమే అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read
Sponsored Ad
 నిధుల కోసం కేంద్రం వద్ద అడుక్కోవద్దు.. అధికారుల తీరుపై ఎంపీ కంగనా రనౌత్ ఫైర్!
National
9 Sept 2026

నిధుల కోసం కేంద్రం వద్ద అడుక్కోవద్దు.. అధికారుల తీరుపై ఎంపీ కంగనా రనౌత్ ఫైర్!

హిమాచల్‌ప్రదేశ్ అధికారుల వైఖరిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద గిన్నె పట్టుకుని అడుక్కోవాల్సిన అవసరం ఏముందని, రాష్ట్రంలోనే సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని సంప్రదించకపోతే మీరే ముందుకొచ్చి అడగాలని, చేతులు కట్టుకుని కూర్చోవడం సరికాదని వ్యాఖ్యానించారు. రూ.1000 కోట్ల కోసం కేంద్రాన్ని అడిగేందుకు సిగ్గుపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. కాగా, కంగన చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కడి ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసనకు దిగాయి.

Read
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం.. హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana
9 Sept 2026

తెలంగాణ పోలీస్ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం.. హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ట్రాన్స్‌జెండర్ల దరఖాస్తులను కూడా తప్పనిసరిగా స్వీకరించాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (TSLPRB)ని న్యాయస్థానం ఆదేశించింది. దరఖాస్తుల్లో కేవలం మేల్, ఫీమేల్ ఆప్షన్లు మాత్రమే ఇచ్చి, మిగతా జెండర్లకు ఎందుకు అవకాశం కల్పించలేదని బోర్డును కోర్టు ప్రశ్నించింది.

ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ తనుశ్రీ మరియు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు సాంకేతిక ఇబ్బందులు ఉంటే, ఆఫ్‌లైన్‌లోనైనా వారి అప్లికేషన్లు తీసుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.

Read
HomeShortsePaperProfile