Skip to main content

QuickToday Shorts

Bite-sized summaries for the modern reader. Stay informed in seconds.

జనగామ సేజ్ హైస్కూల్‌లో జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి
General
19 Aug 2026

జనగామ సేజ్ హైస్కూల్‌లో జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి

జ‌న‌గామ‌, ఆగస్టు 19 (క్విక్ టుడే న్యూస్‌):
జనగామలో జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి జనగామలోని సేజ్ హై స్కూల్ ప్రాంగణం జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పాలమాకుల కుమార్ అధ్యక్షతన నిర్వహించగా జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు అండర్ 8 వయసు నుండి అండర్ 17 వారికి ఈ పోటీలలో పాల్గొనగ తదుపరి దశవయస్సు విభాగాల వారీగా విజేతలకు బహుమతులు అందజేశారు ప్రతిభ చూపిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 23న ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు ఈ జిల్లా స్థాయి పోటి కొరకు మైదానం మరియు సౌకర్యాలు కల్పించిన సేజ్ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ వాదిరెడ్డి రోహన్ రెడ్డికి అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది ఈ కార్యక్రమంలో నీరటి నరేష్ బోట్ల సుమతి సమయ్య తదితరులు పాల్గొన్నారు.

Read
నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం: 'బింబిసార' దర్శకుడితో గ్రాండ్ ఎంట్రీ!
General
19 Aug 2026

నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం: 'బింబిసార' దర్శకుడితో గ్రాండ్ ఎంట్రీ!

నందమూరి అభిమానులకు శుభవార్త. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఖాయమైంది. 'బింబిసార' చిత్రంతో విజయాన్ని సాధించిన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన కథ ఇప్పటికే సిద్ధమైందని సినీ వర్గాలు చెబుతున్నాయి.వచ్చే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నిజానికి ఈ ప్రకటన ముందే రావాల్సి ఉన్నప్పటికీ, బాలకృష్ణకు ఇటీవల గాయం కావడం, ఆ తర్వాత శస్త్రచికిత్స జరగడంతో కాస్త ఆలస్యమైందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Read
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో బిగ్ ట్విస్ట్: కొత్త పార్టీ ప్రకటన చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
Andhra Pradesh
19 Aug 2026

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో బిగ్ ట్విస్ట్: కొత్త పార్టీ ప్రకటన చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతూ ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వివరాలను వెల్లడించారు.సమాజంలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, వారి కోసం నిరంతరం శ్రమించేలా తమ కొత్త పార్టీ నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో శాసనసభ మరియు పార్లమెంట్ సభలలో ప్రజల గొంతుకగా నిలిచి, వారి తరఫున బలంగా గళమెత్తుతామని చెప్పారు. త్వరలోనే, అంటే ఈ నెలలోనే విజయవాడలో ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించి, తమ పార్టీ సిద్ధాంతాలు మరియు భవిష్యత్ రాజకీయ ప్రణాళికను వివరంగా వెల్లడిస్తానని తెలిపారు.

Read
మాక్స్‌వెల్ ఇంట మళ్లీ పండగ వాతావరణం
General
19 Aug 2026

మాక్స్‌వెల్ ఇంట మళ్లీ పండగ వాతావరణం

ఆస్ట్రేలియా క్రికెట్ వీరుడు గ్లెన్ మాక్స్‌వెల్ మరియు అతని భారతీయ మూలాలున్న భార్య విని రామన్ మరోసారి తల్లిదండ్రులయ్యారు. వీరికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని మాక్స్‌వెల్ తెలిపారు. 2022లో వివాహం చేసుకున్న ఈ జంటకు, 2023లో లోగాన్ మార్వెరిక్ మాక్స్‌వెల్ అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా పుట్టిన కుమార్తెకు 'మియా మాక్స్‌వెల్' అని నామకరణం చేశారు. వీరి వివాహం మెల్‌బోర్న్‌లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సంతోషకరమైన వార్తతో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read
బంగారు మైసమ్మ బోనాల ఏర్పాట్లను ప‌రిశీలించిన‌ డిప్యూటీ క‌మిష‌న‌ర్
General
18 Aug 2026

బంగారు మైసమ్మ బోనాల ఏర్పాట్లను ప‌రిశీలించిన‌ డిప్యూటీ క‌మిష‌న‌ర్

బోడుప్ప‌ల్‌, ఆగ‌స్టు18(క్విక్ టుడే న్యూస్‌):

బోడుప్పల్: ఈ నెల 23న జరగనున్న బంగారు మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లను బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ, మేడిపల్లి సీఐ జలేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ డివిజన్ అధ్యక్షులు పొగుల నర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షులు బొమ్మక్ కళ్యాణ్, కొత్త కిషోర్ గౌడ్, చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షులు పొగుల దిలీప్ రెడ్డి, రసాల వెంకటేష్ యాదవ్, ధనగళ్ల యాదగిరి, చిరాల నర్సింహా, ఆలయ చైర్మన్ బొబ్బల లక్ష్మారెడ్డి, ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Read
మద్యం మత్తులో యువ‌కుల‌ హ‌ల్‌చ‌ల్‌
General
18 Aug 2026

మద్యం మత్తులో యువ‌కుల‌ హ‌ల్‌చ‌ల్‌

న‌లుగురికి జరిమానా, 'స్వ‌చ్ఛ‌ భారత్' శిక్ష!

మేడిపల్లి, ఆగస్టు 18 (క్విక్ టుడే న్యూస్‌) :

మద్యం మత్తులో హ‌ల్‌చ‌ల్‌ చేసిన న‌లుగురు యువ‌కుల‌పై కేసు నమోదు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెంగిచెర్లకు చెందిన వై మహేందర్ (31), ఉదయ్ కిరణ్ (25), డి పాషా(32), వరప్రసాద్ (47), యాకయ్య (35) మద్యం సేవించి మేడిపల్లి ఏరియాలో హ‌ల్‌చ‌ల్ చేశారు. దీంతో పోలీసులు పెట్టి కేసులు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. వారిని ఎల్బీనగర్లోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా.. ఒక్కొక్కరికి జరిమానాతో పాటు 'స్వచ్ఛ భారత్' చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నిందితులు పోలీస్ స్టేషన్, కోర్టు పరిసరాల్లో 'స్వచ్ఛ భారత్' చేశారు.

Read
Sponsored Ad
జనగామ డంపింగ్ యార్డును పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్
General
18 Aug 2026

జనగామ డంపింగ్ యార్డును పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్

జ‌న‌గామ‌, ఆగస్టు 17 (క్విక్ టుడే న్యూస్‌):

జనగామ జిల్లాలోని డంపింగ్ యార్డును జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డంపింగ్ యార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. పట్టణ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

Read
ప్రజల సమస్యలకు వేదికగా మండల స్థాయి ప్రజావాణి..
District
17 Aug 2026

ప్రజల సమస్యలకు వేదికగా మండల స్థాయి ప్రజావాణి..

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆగస్టు 17(క్విక్ టుడే న్యూస్)

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలవ్యాప్తంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై అధికారులు అర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో నోడల్‌ అధికారి,ఎంపీడీవో వెంకటేశ్వర్లు,తహసీల్దార్ శ్రీనివాస్,మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్, మండల విద్యాశాఖ అధికారి మహంకాళి బుచ్చయ్య, మెడికల్‌ ఆఫీసర్‌ జ్వలిత,మండల వ్యవసాయ అధికారి రాంనర్సయ్యతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.మండల స్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, వాటిని వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read
నాగుల పంచమి: సంతాన ప్రాప్తికి విశేష పూజా విధానం!
Andhra Pradesh
17 Aug 2026

నాగుల పంచమి: సంతాన ప్రాప్తికి విశేష పూజా విధానం!

శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి పండుగకు హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ పవిత్రమైన రోజున భక్తిశ్రద్ధలతో నాగదేవతను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని, ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు ఇది ఎంతో అనుకూలమైన రోజని పురోహితులు వివరిస్తున్నారు.నాగుల పంచమి నాడు ఉదయాన్నే తలస్నానం ఆచరించి, శుచిగా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి భక్తితో పూజ చేయాలి. ఆ తరువాత సమీపంలోని పుట్ట వద్దకు కానీ, లేదా ఏదైనా నాగదేవత ఆలయానికి కానీ వెళ్లి దర్శనం చేసుకోవాలి. పుట్టలో ఆవు పాలు పోసి, పసుపు, కుంకుమ, గంధం, మరియు పూలతో భక్తిగా అర్చించాలి. నైవేద్యంగా చలిమిడి, పాయసం సమర్పించి మనసారా ప్రార్థిస్తే సర్ప దోషాలన్నీ తొలగిపోయి, సంతాన భాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు కూడా వెల్లివిరుస్తాయని నమ్మకం.

Read
వైసీపీకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్: అసెంబ్లీలో తేల్చుకుందాం రండి
Andhra Pradesh
17 Aug 2026

వైసీపీకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్: అసెంబ్లీలో తేల్చుకుందాం రండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ నేతలకు కీలక సూచనలు చేశారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే, వారి ప్రశ్నలకు మంత్రులతో సమాధానాలు ఇప్పించే పూర్తి బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. డీఎస్సీ, ఇతర ముఖ్యమైన ప్రజా సమస్యలపై కేవలం బయట విమర్శలు చేయడం సరికాదని, నిజంగా ఏవైనా అనుమానాలు ఉంటే సభలో అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్‌పై కూడా స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, వారిలో ఐదుగురు, ఆరుగురిని తమ వైపు తిప్పుకుంటే చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదని అప్పట్లో జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా స్పీకర్ గుర్తు చేశారు.

Read
పెళ్లి పీటల మీద అనూహ్య మలుపు: చివరి నిమిషంలో పెళ్లి వద్దన్న వధువు
Telangana
17 Aug 2026

పెళ్లి పీటల మీద అనూహ్య మలుపు: చివరి నిమిషంలో పెళ్లి వద్దన్న వధువు

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక వివాహ వేడుకలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు, సరిగ్గా తాళి కట్టే సమయానికి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.వివరాల్లోకి వెళితే, బిజినేపల్లి మండలానికి చెందిన ఒక యువకుడితో లింగాల మండలానికి చెందిన యువతికి రెండు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. వివాహ వేడుక కోసం బంధువులు, స్నేహితులు అంతా హాజరయ్యారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో, వధువు తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీనితో చేసేదేమీ లేక ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని చర్చించి, వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, పెళ్లి కోసం చేసిన ఏర్పాట్ల ఖర్చులన్నింటినీ అమ్మాయి తండ్రే భరించాలని గ్రామ పెద్దలు తీర్మానించారు.

Read
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్: రానున్న రెండు రోజులు వానలే వానలు!
Andhra Pradesh
17 Aug 2026

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్: రానున్న రెండు రోజులు వానలే వానలు!

వాయువ్య బంగాళాఖాతం నుండి పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తర ఒడిశా తీరాల మీదుగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రభావంతో రుతుపవన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా రానున్న రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం , శ్రీకాకుళం , విశాఖపట్నం, ఏలూరు , నెల్లూరు , మరియు తిరుపతి జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో కూడా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read
Sponsored Ad
బాలీవుడ్ స్టార్లకు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్
National
17 Aug 2026

బాలీవుడ్ స్టార్లకు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్

బాలీవుడ్ అగ్ర హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నోటీసులు జారీ చేసింది. వీరు ముగ్గురూ కలిసి నటించిన 'విమల్ ఇలాచీ' ప్రకటనపై వివాదం తలెత్తడమే దీనికి కారణం.మహారాష్ట్రలో నిషేధించబడిన విమల్ పాన్ మసాలా ఉత్పత్తులకు పరోక్షంగా ప్రచారం కల్పించేలా ఈ ఇలాచీ యాడ్ ఉందని FDA పేర్కొంది. ఈ ప్రకటనలో వారి పాత్రపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. వినియోగదారులను తప్పుదారి పట్టించే ఇటువంటి ప్రకటనలలో నటించినందుకు చట్ట ప్రకారం గరిష్టంగా రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం. స్టార్ హీరోలు ఇలాంటి ప్రకటనలలో నటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read
తులస్య తండాలో
District
16 Aug 2026

తులస్య తండాలో

20 లీటర్ల గుడుంబా స్వాధీనం..

తొర్రూరు, ఆగస్టు16(క్విక్ టుడే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని తులస్య తండాలో గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసులు తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఎస్సై మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధం చేసిన సుమారు 300 లీటర్ల బెల్లం, చక్కెర మాష్‌ను ధ్వంసం చేశారు.గుడుంబా తయారీలో పాల్గొన్న ముగ్గురిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.అనంతరం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడుంబా, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. గుడుంబా,డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై మహేందర్‌రెడ్డి సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా గుడుంబా తయారీ లేదా మాదకద్రవ్యాల కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Read
నేటి నుంచి మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ
Telangana
16 Aug 2026

నేటి నుంచి మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ

నేటి నుంచి మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్‌ కోర్ అర్బన్‌లోని మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మఇళ్లకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎల్బీనగర్,గోషామహల్, ముషీరాబాద్, చంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లకు వచ్చే నెల 3వరకు మీసేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని హౌసింగ్‌బోర్డు ప్రకటించింది. ఇప్పటికే క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో.. 7,340 ఎల్‌ఐజీ ఫ్లాట్లకు 60,014 మంది దరఖాస్తు చేశారు.

Read
జాతీయ బాక్సింగ్‌ బరిలో సమద్‌ సత్తా
Telangana
15 Aug 2026

జాతీయ బాక్సింగ్‌ బరిలో సమద్‌ సత్తా

యువ క్రీడాకారుడికి రూ.5 వేల ఆర్థిక ప్రోత్సాహం

శివ్వంపేట, ఆగస్ట్ 15 (క్విక్ టు డే న్యూస్):


80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నవాపేట గ్రామానికి చెందిన 16 ఏళ్ల జాతీయస్థాయి బాక్సింగ్‌ క్రీడాకారుడు ఎండీ. సమద్‌ను ఘనంగా సత్కరించారు. చిన్న వయసులోనే బాక్సింగ్‌లో ప్రతిభ కనబరుస్తూ జాతీయస్థాయిలో రాణిస్తున్న సమద్‌ను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ నాయకుడు బాలకుంద ఇంద్రేష్‌ రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సమద్‌ మరింత కష్టపడి సాధన చేసి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. సమద్‌ సాధించిన ప్రతిభ గ్రామానికి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అశోక్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ నల్ల హరిగౌడ్‌, రవిగౌడ్‌, సురేందర్‌రెడ్డి, అంజిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వార్డు సభ్యులు కమ్మరి నరేందర్‌చారి, రాంపల్లి స్వామి, ఎండీ. ముస్తఫా, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Read
చారిత్రాత్మక 600వ టెస్టుకు సిద్ధమైన టీమిండియా!
General
15 Aug 2026

చారిత్రాత్మక 600వ టెస్టుకు సిద్ధమైన టీమిండియా!

భారత్ మరియు శ్రీలంక మధ్య నేటి నుంచి గాలేలో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌తో టీమిండియా చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించనుంది. ఈ మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌లో 600 మ్యాచ్‌లు ఆడిన మైలురాయిని భారత్ చేరుకోబోతోంది. ఈ చారిత్రక మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. క్రీడాభిమానులు సోనీ స్పోర్ట్స్ ఛానెల్స్ మరియు సోనీ లివ్ యాప్‌లో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

Read
రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్ తర్వాత ఏంటి? అశ్విన్ అంచనా!
General
15 Aug 2026

రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్ తర్వాత ఏంటి? అశ్విన్ అంచనా!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తమ ఐపీఎల్ జట్లకు మెంటార్ లేదా కోచ్‌లుగా మారే అవకాశం ఉందని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అభిప్రాయపడ్డారు. రోహిత్ అద్భుతమైన క్రికెటింగ్ మైండ్ ఉన్న ఆటగాడని, అతడు రిటైర్ అయిన వెంటనే ముంబై ఇండియన్స్ అతడిని కోచింగ్ లేదా మెంటార్ రోల్ కోసం సంప్రదించాలని అశ్విన్ సూచించారు. మరోవైపు, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత కొంత విరామం తీసుకున్నప్పటికీ, భవిష్యత్తులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కి హెడ్ కోచ్ అయ్యే అవకాశం ఉందని అశ్విన్ జోస్యం చెప్పారు.

Read
Sponsored Ad
'స్పిరిట్' కోసం ప్రభాస్ మేకోవర్!
General
15 Aug 2026

'స్పిరిట్' కోసం ప్రభాస్ మేకోవర్!

రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రం 'స్పిరిట్' కోసం కఠినమైన డైట్ మరియు ఫిట్‌నెస్ రొటీన్‌ను అనుసరించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన 'ఫౌజీ' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు, అదే సమయంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న 'స్పిరిట్' తదుపరి షెడ్యూల్ కోసం తన లుక్ మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పాత్రకు తగ్గట్లుగా తన దేహాన్ని మార్చుకోవడానికి ఆయన స్పెషల్ డైట్ ప్లాన్ పాటిస్తున్నారని తెలుస్తోంది.

Read
చైన్ స్నాచింగ్ కేసుల్లో 8 మంది నిందితుల అరెస్టు.
General
14 Aug 2026

చైన్ స్నాచింగ్ కేసుల్లో 8 మంది నిందితుల అరెస్టు.


26 లక్షల విలువైన సొత్తు స్వాధీనం...

భద్రాద్రి జిల్లా ప్రతినిధి,( క్విక్ టు డే న్యూస్).

భద్రాది జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్ కేసుల్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 8 మంది నిందితులను అరెస్టు చేయగా,వారి దగ్గర నుంచి సుమారు 150 గ్రాములు ఆరు బంగారు గొలుసులు,మూడు ద్విచక్ర వాహనాలు,స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.ఈ కేసును చేదించిన వారిలో పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్,అశ్వారావుపేట సిఐ నాగరాజు,ఎస్సైలు రాజేష్ కుమార్, రాజు,బాలస్వామి నాదం,దేవ సింగ్, ప్రసాద్,కానిస్టేబుల్ వెంకట్ ధర్మారావు లక్ష్మయ్య రామకృష్ణారెడ్డి బాలకృష్ణ నరసింహారావు, మౌనిక తదితరులు ఉన్నారు.

Read
HomeShortsePaperProfile