
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి పొంగులేటి పరామర్శ
కుటుంబ సభ్యులకు భరోసా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
హైదరాబాద్, జూలై 28 (క్విక్ టుడే న్యూస్):
మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని కలిసిన మంత్రి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులను కలిసి అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పురోగతిపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పెద్ది కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని, ఆయన త్వరితగతిన పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


