Back to FeedQuickToday Shorts

General
Aug 18, 2026Short Read
బంగారు మైసమ్మ బోనాల ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్
బోడుప్పల్, ఆగస్టు18(క్విక్ టుడే న్యూస్):
బోడుప్పల్: ఈ నెల 23న జరగనున్న బంగారు మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లను బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ, మేడిపల్లి సీఐ జలేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ డివిజన్ అధ్యక్షులు పొగుల నర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షులు బొమ్మక్ కళ్యాణ్, కొత్త కిషోర్ గౌడ్, చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షులు పొగుల దిలీప్ రెడ్డి, రసాల వెంకటేష్ యాదవ్, ధనగళ్ల యాదగిరి, చిరాల నర్సింహా, ఆలయ చైర్మన్ బొబ్బల లక్ష్మారెడ్డి, ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.





