Back to FeedQuickToday Shorts

Telangana
Sep 3, 2026Short Read
తెలంగాణ మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది? రేసులో ఎవరెవరున్నారు?
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత ఏర్పడిన ఖాళీ భర్తీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్, ప్రేమ్ సాగర్ రావుతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, సామాజిక సమీకరణాలరీత్యా ఈ కీలక పదవిని తిరిగి బీసీ వర్గానికే కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
దీంతో హైకమాండ్ తీసుకోబోయే తుది నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ఆశావహులు అధిష్టానానికి తమ ప్రయత్నాలు ప్రారంభించి రిక్వెస్ట్లు పెట్టుకున్నారు.
ఈ మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.





