Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 31, 2026Short Read
ఏపీలో పెరిగిన ఉల్లి ధరలు.. కర్నూలు మార్కెట్లో క్వింటాల్ రూ.4 వేలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉల్లి రైతులకు అదృష్టం వరించింది.
కొద్ది వారాల క్రితం క్వింటాల్కు రూ.2,000 లోపు ఉన్న ధర..
ఇప్పుడు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఏకంగా రూ.4 వేల రికార్డు స్థాయికి చేరుకుంది.కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు.
అకస్మాత్తుగా ధరలు పెరగడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి 70కి చేరడం సామాన్య వినియోగదారులపై తీవ్ర భారాన్ని మోపుతోంది.





