
కొత్త పింఛన్ల దరఖాస్తుకు నేడే ఆఖరు గడువు - వెంటనే అప్లై చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి నేటితో గడువు ముగియనుంది.
అర్హత ఉండి ఇంతవరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే స్పందించి స్థానిక స్వర్ణ గ్రామ లేదా స్వర్ణ వార్డు సచివాలయాలను సందర్శించి అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ దరఖాస్తు ప్రక్రియ కోసం దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రం , సదరం సర్టిఫికెట్, దివ్యాంగులకు లేదా వితంతువులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు (భర్త డెత్ సర్టిఫికెట్ వంటివి) తప్పనిసరిగా జతపరచాల్సి ఉంటుంది.
మరోవైపు, ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు గడువును మరింత పెంచాలని ప్రజల నుండి, పలు వర్గాల నుండి అధికారులకు విజ్ఞప్తులు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.





