Back to FeedQuickToday Shorts

General
Sep 14, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
శ్రీవారి భక్తులకు గమనిక: 20వ తేదీ వరకు టీటీడీ సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత!
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుపతిలో మంజూరు చేసే టైమ్ స్లాట్ సర్వదర్శన (SSD) టోకెన్ల పంపిణీని ఈ నెల 20వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.తిరిగి 21వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను 20వ తేదీన భక్తులకు జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఈ సమాచారాన్ని తెలియజేస్తూ తిరుపతిలోని 3 టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు.
మరోవైపు, వరుస సెలవుల కారణంగా ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి తగిన విధంగా ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
Tags:#General#National





