Back to FeedQuickToday Shorts

General
Aug 4, 2026Short Read
E20 పెట్రోల్పై కేంద్రం స్పష్టీకరణ: వెనక్కి తగ్గేదే లేదు!
E20 పెట్రోల్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది.
రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ బదులిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు పాడవుతాయని, మైలేజీ తగ్గుతుందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
పైగా, ఇందులోని ఆక్టేన్ కారణంగా వాహనాల యాక్సిలరేషన్ మెరుగుపడుతుందని ఆయన వివరించారు.
E20 పెట్రోల్పై ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో మంత్రి సురేశ్ గోపీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.





