Back to FeedQuickToday Shorts

General
Aug 3, 2026Short Read
పులుల సంరక్షణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైపవర్ కమిటీ ఏర్పాటు!
క్విక్ టుడే న్యూస్, ఏపీ :- ఏపీలో పులుల సంరక్షణ, నిర్వహణ చర్యల అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఐదుగురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR)లో పులుల సంరక్షణ వ్యవస్థను సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకాలు రూపొందించనుంది.
రెండు రోజుల క్రితం ఒక ఆడ పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.





