GeneralNational
చిన్నారుల్లో పెరుగుతున్న మైగ్రేన్ ముప్పు: వైద్యుల హెచ్చరిక
Editorial Team
|1 min read

ఇటీవలి కాలంలో చిన్నపిల్లల్లో సైతం మైగ్రేన్ సమస్య క్రమంగా పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 12 సంవత్సరాలలోపు పిల్లలలో దాదాపు 10 శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని అంచనా.తలకు రెండువైపులా తీవ్రమైన నొప్పి, వికారం, వాంతులు, కడుపునొప్పి, వెలుతురు చూడలేకపోవడం వంటివి మైగ్రేన్ ప్రధాన లక్షణాలు. నిద్రలేమి, డీహైడ్రేషన్, ఒత్తిడి వంటి కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువవుతుందని వైద్యులు వివరిస్తున్నారు.పిల్లలకు మైగ్రేన్ వస్తే పెయిన్ కిల్లర్స్ వాడటం కంటే.. సరైన నిద్ర, శారీరక శ్రమ, వేళకు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చని సలహా ఇస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Tags:#General#National#QuickToday





