Back to FeedQuickToday Shorts

General
Aug 13, 2026Short Read
శ్రావణ మాసం రాకతో కొండెక్కిన పూల ధరలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పూల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
పండుగలు, శుభకార్యాల సీజన్ కావడంతో మార్కెట్లలో పూలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
విశాఖపట్నంలోని మార్కెట్లలో వినియోగదారులు పూలు, పండ్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండటంతో ధరలకు రెక్కలొచ్చాయి.ప్రస్తుతం మార్కెట్లో కిలో చామంతి పూలు రూ.380, గులాబీలు రూ.300 పలుకుతున్నాయి.
ఇక మల్లె పూల ధర ఏకంగా కిలో రూ.800కి చేరింది.
మూర లెక్కన చూస్తే మల్లె పూలు, కనకాంబరాలు రూ.50 చొప్పున అమ్ముడుపోతున్నాయి.
జాజులు మూర రూ.40, బంతి పూల దండ రూ.30గా ఉన్నాయి.
పెరిగిన ధరలతో సామాన్యులు కొంత ఇబ్బంది పడుతున్నారు.
మరి మీ ప్రాంతంలో పూల ధరలు ఎలా ఉన్నాయో గమనించారా?





