నీట్ లీక్తో సర్వస్వం కోల్పోయా : బాలీవుడ్ నటి మానుషి చిల్లర్

Manushi Chhillar: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ తన విద్యార్థి దశలో నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా సర్వస్వం కోల్పోయి తన కష్టాలను గుర్తు చేసుకున్నారు. సోహా అలీ ఖాన్ నిర్వహించిన ‘ఆల్ అబౌట్ హర్’ యూట్యూబ్ టాక్ షోలో మాట్లాడుతూ, 2015లో ఎంతో కష్టపడి సిద్ధమైన పరీక్ష రద్దై మళ్లీ రాయాల్సి రావడం జీవితంలో అత్యంత కఠినమైన అనుభవమని చెప్పారు. వైద్య విద్య కోసం కూచిపూడి, పెయింటింగ్ వంటి తనకు ఇష్టమైన అభిరుచులను ఏడాది పాటు పక్కన పెట్టానని తెలిపారు.
కోచింగ్ కోసం అప్పులు చేసి, ఇతర నగరాలకు వెళ్లి చదివే విద్యార్థులపై ఇలాంటి ఘటనలు తీవ్ర మానసిక ఒత్తిడి తెస్తాయని అన్నారు. పరీక్ష వాయిదా పడిన 45 రోజులు మరింత ఒత్తిడిగా గడిచాయని చెప్పారు. అయితే రోజూ వ్యాయామం, బాస్కెట్బాల్ ఆడాలని తల్లిదండ్రులు ప్రోత్సహించడం వల్లే మానసికంగా నిలబడగలిగానని వెల్లడించారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని గెలుచుకున్న ఆమె, అనంతరం ‘సమ్రాట్ పృథ్విరాజ్’, ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాలతో బాలీవుడ్లో నటిగా గుర్తింపు పొందారు.





