
వంద రోజుల్లో స్వర్గం అన్నారు, వెయ్యి రోజులుగా నరకం చూపిస్తున్నారు: కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ పాలనపై ఒక ఛార్జిషీట్ను విడుదల చేశారు.
ఎన్నికల సమయంలో వంద రోజుల్లోనే స్వర్గం చూపిస్తామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు వెయ్యి రోజులుగా నరకం చూపిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.
శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలు భయాందోళనల మధ్య బతుకుతున్నారని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైన స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెడితే, దానిని వారు ఇప్పుడు కుక్కలు చించిన విస్తరిలా నాశనం చేశారని ఆయన ఘాటుగా విమర్శించారు.
అంతేకాకుండా, కేవలం వెయ్యి రోజుల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.
4.50 లక్షల కోట్ల మేర భారీ అప్పులు చేసిందని ఆరోపించారు.





