Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 22, 2026Short Read
తిరుమలలో గోబీ వంటకాలపై నిషేధం!
తిరుమల కొండపై కాలిఫ్లవర్ (గోబీ)తో చేసే వంటకాలను టీటీడీ నిషేధించింది.
ఇటీవల కాలిఫ్లవర్లో పురుగులు వస్తుండటాన్ని గమనించిన అధికారులు, భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాలిఫ్లవర్ వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉండగా, తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో చైనీస్ వంటకాల తయారీ మరియు విక్రయాలపై ఇప్పటికే నిషేధం అమలులో ఉన్న విషయం విధితమే.





