
భక్తి శ్రద్ధల మధ్య శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ సింహద్వార ప్రతిష్ఠాపన
మంత్రోచ్ఛరణలు.. భజన సంకీర్తనలు.. పూల పరిమళాలు.. భక్తాంజనేయ ఆలయంలో పండుగ వాతావరణం
పాలకుర్తి,ఆగష్టు 30 (క్విక్ టుడే న్యూస్ ):పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ పనుల్లో భాగంగా గర్భగుడి సింహద్వారం ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తుల కోలాహలం, వేద మంత్రోచ్ఛరణలు, నడుమ ఘనంగా జరిగింది.
మామిడి తోరణాలు, రంగురంగుల పూల అలంకరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
పాలకుర్తి సర్పంచ్ కమ్మగాని విజయనాగన్న, సింహద్వారం, కిటికీల దాతలు గుడికందుల యాకన్న–సౌమ్య దంపతులు, ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యుల చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించారు.
పూజారి గంగు నవీన్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, సింధూర లేపనం, పుష్పాలంకరణ, నైవేద్యం,హారతినిర్వహించారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కమ్మగాని సుధాకర్, సలేంద్ర రమసోమన్న, దాసరి అనూషమధు, రేపాల అశోక్, దేవసాని రాంబాబు, మేస్త్రి రాఘవులు తదితరులతో పాటు ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు, దాతలు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





