Back to FeedQuickToday Shorts

International
Sep 9, 2026Short Read
నేను మోసగాడిని కాదు.. భారత్కు రాకపోవడానికి కారణం అదే: విజయ్ మాల్యా
తనపై మీడియా మోసగాడిగా ముద్ర వేయడం సరికాదని ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా అన్నారు. DRT ఉత్తర్వుల ప్రకారం తాను చెల్లించాల్సిన మొత్తం రూ.10,230 కోట్లు కాగా, బ్యాంకులు ఏకంగా రూ.14,131 కోట్ల ఆస్తులను జప్తు చేశాయని ఆయన తెలిపారు. రివర్స్లో తనకే రూ.6,722 కోట్లు రీఫండ్ రావాల్సి ఉందని, దీనిపై మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
1992 నుంచి తాను లండన్లో (UK) శాశ్వత నివాసంగా ఉంటున్నానని చెప్పారు. చట్టపరంగా యూకేను వదిలి వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నందునే తాను భారతదేశానికి రాలేకపోతున్నానని విజయ్ మాల్యా వివరణ ఇచ్చారు.





