Back to FeedQuickToday Shorts

International
Sep 8, 2026Short Read
యుద్ధం గెలిస్తే ప్రపంచానికి శుభవార్త అంటున్న ట్రంప్!
ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా విజయం సాధించిన వెంటనే చమురు ధరలు భారీగా పడిపోతాయని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 3 డాలర్లుగా ఉన్న గ్యాలన్ (3.78 లీటర్లు) ఆయిల్ ధర, యుద్ధం ముగిశాక 2 డాలర్ల కంటే దిగువకు చేరుతుందని ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు.ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధ దేశంగా మారలేదని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలన్నీ అతి త్వరలోనే జరగబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా ఇరాన్ పై అమెరికా సైన్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని త్వరగా ముగించాలనే యోచనలో ట్రంప్ ఉన్నట్లు అర్థమవుతోంది.



