Back to FeedQuickToday Shorts

Telangana
Sep 13, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
శృతి మించిన రాజకీయ నాటకాలు: BRS మాక్ అసెంబ్లీపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణలో BRS పార్టీ నిర్వహించిన మాక్ అసెంబ్లీని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా BRSపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
BRS నేతలు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నాటకాలు ఆడటం తప్ప, ప్రజలకు ఒనగూరే ప్రయోజనం శూన్యమని మండిపడ్డారు.
వారి వ్యవహార శైలి "డ్రామారావు సెట్టు, స్కిట్టు కామెడీ షో" లాగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇలాంటి పగటి వేషాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి "సున్నా" లాభమని ఆయన విమర్శించారు.
మరోవైపు, ఈ మాక్ అసెంబ్లీలో CM పాత్ర పోషించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
"నన్ను అన్ని మాటలు అన్న సురేఖను ఢిల్లీకి వెళ్లి తొక్కి వచ్చాను" అంటూ ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి.
Tags:#Telangana#National




