Back to FeedQuickToday Shorts

Telangana
Sep 1, 2026Short Read
దివ్యాంగుల పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వానికి జనసేన సూటి ప్రశ్నలు
రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ల పంపిణీపై తెలంగాణ జనసేన పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసింది.
ప్రస్తుతం ఇస్తున్న రూ.4,016 ఆసరా పెన్షన్లు లబ్ధిదారులకు సకాలంలో అందడం లేదని, పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని ఎప్పుడు విడుదల చేస్తారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.అలాగే, గతంలో దివ్యాంగులకు ఇచ్చిన రూ.6,000 పెన్షన్ హామీపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది.
ప్రతి నెలా పెన్షన్లు ఎలాంటి ఆలస్యం లేకుండా లబ్ధిదారులకు సకాలంలో అందేలా ప్రభుత్వం శాశ్వత చర్యలు ఎప్పుడు తీసుకుంటుందని జనసేన సూటిగా ప్రశ్నించింది.





