Back to FeedQuickToday Shorts

Telangana
Sep 7, 2026Short Read
శుభకార్యాల్లో హిజ్రాల వసూళ్లు: స్పెషల్ డ్రైవ్ కు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
తెలంగాణలో శుభకార్యాల సమయంలో హిజ్రాలు డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదులపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు.
ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
గతంలో తాను హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో ఇలాంటి ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు గుర్తుచేశారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీపీలకు సూచిస్తానని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఇదే సమయంలో, హైదరాబాద్లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా సేవలందించిన ట్రాన్స్జెండర్లు ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా చాలా బాధ్యతగా పనిచేశారని డీజీపీ అభినందించారు.





