Back to FeedQuickToday Shorts

Telangana
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్: సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్మెంట్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఈ విధానాన్ని రద్దు చేయబోమని, ఇకపై కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా రీయింబర్స్మెంట్ నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు.
అలాగే, ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో పెట్టిన రూ.5,430 కోట్ల బకాయిలను తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Tags:#Telangana#National#Shorts





