Back to FeedQuickToday Shorts

District
Jul 14, 2026Short Read
33 గ్రాముల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్టు
శివ్వంపేట, జులై 14 (క్విక్ టు డే న్యూస్):
గంజాయి విక్రయానికి తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులను శివ్వంపేట పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ మధుకర్రెడ్డి సిబ్బందితో కలిసి గ్యాస్ గోదాం సమీపంలో దాడి నిర్వహించగా, నిందితుల వద్ద నుంచి 33 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శివ్వంపేట మండలంలో విక్రయించి అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు





