
కేజీబీవీ, యూఆర్ఎస్, ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
ముఖ్యమంత్రికి పోస్టుకార్డుల ద్వారా వినతి
శివ్వంపేట, జులై 26 (క్విక్ టు డే న్యూస్):
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శివ్వంపేట కేజీబీవీలో ఆదివారం ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ముఖ్యమంత్రి పేరున పోస్టుకార్డులు పంపించారు.ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ కేజీబీవీ, యూఆర్ఎస్, ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులు విధి నిర్వహణలో శక్తికి మించి పనిచేస్తున్నప్పటికీ కనీస వేతనం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు తగిన కనీస వేతనం చెల్లించడంతో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సమ్మె కాలపు వేతనాలను విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు యు. గంగాధర్తో పాటు కేజీబీవీ ఉపాధ్యాయినులు మంజుల, జ్యోతి, స్వప్న, కోమల, రాధిక, జ్వాల, జి. స్వప్న, వెరోనిక, రాణి, సంతోషి తదితరులు పాల్గొన్నారు
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


