Back to FeedQuickToday Shorts

District
Aug 12, 2026Short Read
తొర్రూరు మున్సిపాలిటీలో పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఆగస్టు 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీలో పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారుల నుంచి ఈ నెల 31 వరకు పెన్షన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన వారు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తులు సమర్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజల అవసరాలను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్,వార్డు కౌన్సిలర్ పేర్ల జంపన్న,వార్డు అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.





