
ఆషాఢ ఉత్సవాల్లో సినీనటులు విజయ్, త్రిషలతో బ్యానర్
తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్లో నిర్వహిస్తున్న మారియమ్మన్ ఆలయ ఆషాఢ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది.
ఈ బ్యానర్లో కోలీవుడ్ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను పది తలల రావణాసురుడి రూపంలో, ప్రముఖ నటి త్రిషను అమ్మవారి రూపంలో చిత్రీకరించారు.
ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
విషయం పోలీసుల దృష్టికి చేరడంతో అధికారులు వెంటనే స్పందించారు.
వివాదాస్పద బ్యానర్ను తొలగించి, దానిని ఏర్పాటు చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
కాగా, విజయ్, త్రిష పేర్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వివిధ ప్రచారాల నేపథ్యంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నప్పటికీ, వాటిపై ఇద్దరూ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


