Back to FeedQuickToday Shorts

General
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై.. రేసులో మాజీ క్రికెటర్లు!
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగార్కర్ ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ 4వ తేదీతో ఆయన మూడేళ్ల పదవీకాలం పూర్తి కానుంది. అయితే, ఆ పదవిలో ఇకపై కొనసాగడం తనకు ఇష్టం లేదని అగార్కర్ బీసీసీఐకి అధికారికంగా తెలియజేశారని ఓ బోర్డు అధికారి వెల్లడించారు.
దీంతో ఆయన స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్ను బీసీసీఐ త్వరలోనే నియమించనుంది. తదుపరి సెలెక్టర్ పదవి కోసం టీమిండియా మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా పేర్లు రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నట్లు సమాచారం.
Tags:#General#National#Shorts





