Back to FeedQuickToday Shorts

International
Aug 7, 2026Short Read
మోడీకి ఇజ్రాయిల్ ప్రధాని ఫోన్ కాల్.. ఎందుకంటే?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ లో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతలు భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాలపై సమీక్ష నిర్వహించారు.
కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు.
అంతేకాకుండా, పశ్చిమాసియా (వెస్ట్ ఆసియా) లో నెలకొన్న తాజా పరిస్థితులు, యుద్ధ వాతావరణంపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఫోన్ కాల్ జరిగినట్లు సమాచారం.




