Back to FeedQuickToday Shorts

National
Aug 12, 2026Short Read
అయోధ్య రామ మందిరం సీఈఓ పదవికి అర్హులు ఎవరంటే?
అయోధ్య రామమందిర CEO పదవికి 5,200 మంది దరఖాస్తు చేయగా, కేవలం 18 మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు.
ఈ ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులను ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు.
ఇంటర్వ్యూకు ముందు వారు 34 పాయింట్ల గూగుల్ ఫామ్ నింపాల్సి వచ్చింది.
అందులో 'మీరు పక్కా హిందువులా?
శ్రీరాముడిపై విశ్వాసం ఉందా?
జంధ్యం ధరిస్తారా?
మద్యం, మాంసం అలవాటు ఉందా?
హిందూ సంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించడానికి ఇబ్బంది ఉందా?' వంటి ప్రశ్నలు ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంది.
ఈ ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.





