Back to FeedQuickToday Shorts

National
Aug 12, 2026Short Read
'ఆజాద్ హింద్ పార్టీ'ని స్థాపించనున్న నేతాజీ మనవడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల ఢిల్లీని షేక్ చేసిన 'జెన్-జి' స్ఫూర్తితో 'ఆజాద్ హింద్ పార్టీ' పేరుతో ఈ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు.తన తాత నేతాజీ నమ్మిన సెక్యులర్ భావజాలాన్నే ఈ పార్టీ అనుసరిస్తుందని చంద్రకుమార్ స్పష్టం చేశారు.
గత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరిన ఆయన, ఇటీవల ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు.





