Back to FeedQuickToday Shorts

National
Aug 9, 2026Short Read
పార్లమెంట్లో కంగనా ఖరీదైన స్టైల్.. నెట్టింట వైరల్!
నటి, ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరైన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
నీలిరంగు సిల్క్ చీరలో స్టైలిష్గా కనిపించిన ఆమె, ఖరీదైన వస్తువులు ధరించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.ఆమె ధరించిన రోలెక్స్ వాచ్ ధర రూ.
21 లక్షలు, చేతిలో ఉన్న హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్ ధర రూ.
35 లక్షలు ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
చీరకు తగ్గట్టుగా పట్టుకున్న గొడుగు ధర కూడా రూ.
6,100 అని అంటున్నారు.
ఎంపీగా ఉంటూ ఇంత ఖరీదైన వస్తువులు వాడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు ఆమె స్టైల్ను మెచ్చుకుంటుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు.





