
జగన్నాథ రథయాత్రలో అపశృతి
తొక్కిసలాటలో ఊపిరాడక ఒకరు మృతి
పూరీ, జూలై16:
ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా తీవ్ర రద్దీ నెలకొని అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రాండ్ రోడ్డులో భక్తుల రాక భారీగా పెరగడంతో తొక్కిసలాటకు దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటుండగా, వంద మందికిపైగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే సహాయక సిబ్బంది స్పందించి అస్వస్థతకు గురైన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. రద్దీ కారణంగా ఓ వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. అనంతరం అతడిని పూరీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ఘటనపై అధికారుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అదే సమయంలో రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 120 మందికి వైద్య చికిత్స అందించినట్లు సమాచారం.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


