
హేజో లేబొరేటరీస్లో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని హేజో లేబొరేటరీస్ కెమికల్ కంపెనీలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది.
కంపెనీలోని సి-బ్లాక్లో నైట్ షిఫ్ట్లో 18 మంది కార్మికులు విధులు నిర్వహిస్తుండగా రియాక్టర్ ఒక్కసారిగా పేలింది.
ఈ ఘటనలో పెద్దవూర మండలానికి చెందిన చిన్న నాగిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన నాగన్న బోయిన నరేష్కుమార్ మృతి చెందారు.
మరో పది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
పేలుడు ధాటికి మంటలు వ్యాపించగా, చౌటుప్పల్, హయత్నగర్ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
కంపెనీలో వరుస ప్రమాదాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ భద్రతా ప్రమాణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరుతున్నారు.





