Back to FeedQuickToday Shorts

Telangana
Aug 7, 2026Short Read
రేవంత్ పాలనపై కేటీఆర్ ధ్వజం: కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష!
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలలో బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
'జై తెలంగాణ' అని నినదించడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డికి మనసు రావడం లేదని ఆరోపించారు.
మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్, రాహుల్ గాంధీలు ఇప్పుడు దానిపై నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.మరోవైపు తెలంగాణకు చెందిన 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోందని, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు.
అందుకే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి రాష్ట్రాన్ని మళ్లీ కేసీఆర్ చేతిలో పెడదామని పిలుపునిచ్చారు.





