Back to FeedQuickToday Shorts

Telangana
Aug 8, 2026Short Read
నిరుద్యోగులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు డిమాండ్
రెండు లక్షల ఉద్యోగాల హామీని విస్మరించి నిరుద్యోగులను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కేవలం 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు క్యూలో నిలబడే దుస్థితి తీసుకువచ్చారని ఆయన మండిపడ్డారు.ఇంజనీరింగ్ చదివిన యువతను 'క్రిమినల్ వేస్ట్' అని అనడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు.
నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలకు గాను రేవంత్ రెడ్డి వెంటనే నిరుద్యోగులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.





