Back to FeedQuickToday Shorts

Telangana
Aug 8, 2026Short Read
కొత్త పెన్షన్లకు అనర్హులు వీరే: తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు!
తెలంగాణలో కొత్త పెన్షన్ల మంజూరు కోసం ప్రభుత్వం అనర్హుల జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితా ప్రకారం, వార్షికాదాయం గ్రామాల్లో రూ.
1.50 లక్షలు, పట్టణాల్లో రూ.
2 లక్షలు మించి ఉన్నవారు అనర్హులుగా పరిగణించబడతారు.అలాగే, 3 ఎకరాలకు మించి మాగాణి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉన్నవారు కూడా అనర్హులు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు ఉన్నవారు, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు లేదా ఫోర్ వీలర్ ఉన్నవారు కొత్త పెన్షన్లకు అర్హత సాధించలేరు.
ఇప్పటికే ఏదైనా పింఛన్ పొందుతున్న వారు కూడా కొత్త పెన్షన్లకు అనర్హులుగా ప్రకటించబడ్డారు.





