
భోజ్శాలలో ముస్లింల ప్రార్థనలకు తాత్కాలిక ఊరట
రాంచి, జూలై14:
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్శాల–కమల్ మౌలా మసీదు ప్రాంగణంలో శుక్రవారం నమాజ్ నిర్వహించేందుకు ముస్లింలకు సుప్రీంకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. వివాదాస్పద ప్రాంతానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని ప్రార్థనల కోసం వినియోగించుకోవచ్చని కోర్టు ఆదేశించింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఆ ప్రదేశంలో నమాజ్ నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ ఎన్.వి. మోహన్లతో కలిసి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, తాత్కాలిక ఏర్పాటుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది. అదేవిధంగా, తమ అనుమతి లేకుండా వివాదాస్పద భోజ్శాల ప్రాంగణంలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని పురావస్తు శాఖకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.

