Back to FeedQuickToday Shorts

General
Aug 8, 2026Short Read
అర్ధరాత్రి రిషబ్ పంత్ ట్వీట్ కలకలం!
క్రికెటర్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ చేస్తూ అర్ధరాత్రి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
'సార్, నా సొంత రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవడానికి మూడేళ్లుగా స్థలం దొరకడం లేదు.
ప్రభుత్వం ఇస్తానన్న భూమి రాలేదు.
గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది, లేదా కొనుక్కోవడానికైనా అనుమతివ్వండి' అని పంత్ కోరాడు.
ఒక స్టార్ క్రికెటర్ ఇలా స్థలం కోసం వేడుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
కొందరైతే అతని అకౌంట్ హ్యాక్ అయిందేమో అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.





