Back to FeedQuickToday Shorts

National
Aug 7, 2026Short Read
లోన్ వసూళ్ల కోసం కస్టమర్ల గాడ్జెట్లను లాక్ చేయొద్దు: ఆర్బీఐ
రుణాల వసూళ్ల ప్రక్రియలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అనుసరిస్తున్న కఠిన విధానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ఆదేశాలు జారీ చేసింది.
పర్సనల్, వెహికల్, హోమ్ లోన్స్ లేదా ఇతర ఏవైనా రుణాల చెల్లింపుల్లో వినియోగదారులు విఫలమైనప్పుడు, వారి పర్సనల్ స్మార్ట్ఫోన్లు లేదా ల్యాప్టాప్లను పనిచేయకుండా నిలిపివేయడం చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఒకవేళ ఆయా గాడ్జెట్లను అదే బ్యాంకు రుణంతో కొనుగోలు చేసి ఉంటే, రుణ వసూలుకు ఇతర మార్గాలన్నీ విఫలమైన తర్వాతే, చివరి అస్త్రంగా ఆ పరికరాలను డిసేబుల్ చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
అదే సమయంలో, బ్యాంకుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, SMS లను ఖాతాదారులు బ్లాక్ చేయొద్దని కూడా ఆర్బీఐ సూచించింది.





