Back to FeedQuickToday Shorts

National
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఫార్మసీలలో ఇకపై సీసీటీవీ నిఘా తప్పనిసరి.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే అంతే సంగతులు!
వైద్య రంగంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా జరిగే మందుల అమ్మకాలను పూర్తిగా వెరిఫై చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఇందులో భాగంగా అన్ని ఫార్మసీలు, రిటైల్ స్టోర్లలో సీసీటీవీ నిఘా ఉండాలని యోచిస్తూ ఓ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
ఈ సీసీటీవీ రికార్딩్లను కనీసం 3 నెలల పాటు భద్రపరచాలని ఈ నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రిస్క్రిప్షన్ పేరుతో జరుగుతున్న అడ్డగోలు విక్రయాలకు, అలాగే పెద్దలకు సంబంధించిన దగ్గు మందులు పిల్లలకు ఇవ్వకుండా అడ్డుకోవడానికే ఈ నిబంధనలు తీసుకువస్తున్నట్లు సమాచారం అందుతోంది.
Tags:#National#National#Shorts





