Back to FeedQuickToday Shorts

Telangana
Sep 6, 2026Short Read
బీఆర్ఎస్ 'టాప్-3'పై సీఎం రేవంత్ ఫోకస్.. వారి కంచుకోటల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా?
నకిరేకల్ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేయాలని, గజ్వేల్లో మళ్లీ తేల్చుకుందామని సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్దిపేట స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
అయితే, దశాబ్దాలుగా వారి కంచుకోటలుగా ఉన్న ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టాప్-3 నేతలను ఓడించడం అంత సులువైన విషయమేనా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా వారిని ఢీకొట్టే స్థాయిలో బలమైన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా?
అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?





