
గ్రామ పంచాయతీల ఖాతాల్లోనే స్వంత ఆదాయం: తెలంగాణ అసెంబ్లీ కీలక నిర్ణయం
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
పంచాయతీలకు వచ్చే స్థానిక ఆదాయాన్ని ఇకపై ట్రెజరీలో కాకుండా, నేరుగా ఆయా పంచాయతీల సొంత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును నిన్న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది.ఇకపై పంచాయతీలు తమ నిధులను గ్రామసభ తీర్మానం ఆధారంగానే నేరుగా వినియోగించుకునే వెసులుబాటు లభించనుంది.
గతంలో ట్రెజరీ ద్వారా నిధుల డ్రా ప్రక్రియలో ఎదురవుతున్న తీవ్ర జాప్యం, ఇబ్బందులకు ఈ కొత్త నిర్ణయంతో చెక్ పడనుంది.
పంచాయతీల ఆదాయం గ్రామాల స్వయం సమృద్ధికి, మౌలిక వసతుల అభివృద్ధికి పూర్తిస్థాయిలో ఉపయోగపడాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.




