
సీఎం నివాసంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు... ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగాలని ఆకాంక్ష
వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరికీ విజయాలు, సంతోషం కలగాలని గణేశుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. గణనాథుడి అనుగ్రహంతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. సమాజంలో సౌభ్రాతృత్వం, పరస్పర సద్భావన, మానవతా విలువలు మరింత బలపడాలని అభిలషించారు. ప్రతి కార్యంలో ఎదురయ్యే అవరోధాలను తొలగించి విజయపథంలో నడిపించాలని, ప్రజలకు జ్ఞానం, ధైర్యం, సత్ప్రవర్తన ప్రసాదించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.





