Back to FeedQuickToday Shorts

Telangana
Sep 6, 2026Short Read
కేసీఆర్ ఫామ్హౌస్ రాజకీయాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎర్రవెల్లి ఫామ్హౌస్లో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడం రాచరిక పోకడలకు, నియంత ధోరణికి నిదర్శనమని ఆరోపించారు.
ఇదే పద్ధతి కొనసాగితే రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలనే ఫామ్హౌస్లో నిర్వహించాలని కేసీఆర్ డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు.
ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి కూడా అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నారని మంత్రి విమర్శించారు.
ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకులు ఇలా వ్యవహరించడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.





