Back to FeedQuickToday Shorts

General
Sep 5, 2026Short Read
సినిమాల్లో అసభ్యత, హింస.. సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది?: నటుడు సుమన్
ప్రస్తుత కాలంలో కొందరు దర్శకనిర్మాతలకు సామాజిక బాధ్యత కరువైందని ప్రముఖ నటుడు సుమన్ విమర్శించారు.
అసభ్యకరమైన, హింసాత్మక దృశ్యాలతో కూడిన కొన్ని సినిమాలు సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి కంటెంట్కు సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇస్తుందో అర్థం కావడం లేదన్నారు.
స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా వల్ల ఇప్పటికే యువత పెడదోవ పడుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల ద్వారా వారికి మంచి సందేశం ఇవ్వాలి తప్ప చెడు వైపు మళ్లించకూడదని సూచించారు.
బాధ్యతాయుతంగా సినిమాలు తీయాలని ఫిల్మ్ మేకర్స్ను ఆయన కోరారు.





