Back to FeedQuickToday Shorts

National
Sep 5, 2026Short Read
టెలికాం రంగంలో డేటా విప్లవం: పదేళ్లు పూర్తి చేసుకున్న 'జియో'
టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన 'జియో' ప్రస్థానం మొదలై నేటికి పదేళ్లు పూర్తయింది.
2016లో సరిగ్గా ఇదే రోజున జియో సేవలు ప్రారంభమయ్యాయి.
అప్పట్లో రూ.228 ఉన్న 1GB డేటా ధరను పదేళ్లలో ఏకంగా రూ.7.9కి తగ్గించి టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీసింది.
దీని ఫలితంగా ప్రస్తుతం నెలకు సగటు డేటా వినియోగం 42.3GBకి చేరింది.
దేశవ్యాప్తంగా జియో యూజర్ల సంఖ్య 50 కోట్లు దాటగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.25 కోట్ల మంది వినియోగిస్తున్నారు.
అయితే, గత కొంతకాలంగా నెట్వర్క్ సమస్యలు తలెత్తుతున్నాయంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.





