Back to FeedQuickToday Shorts

Telangana
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
రేవంత్రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. ఆస్తులన్నీ రాసిచ్చేందుకు సిద్ధం!
కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
తమ కుటుంబానికి రూ.లక్ష కోట్ల భూములు ఉన్నాయంటూ సీఎం విషప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ మేరకు రేవంత్కు కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు.'మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం, రాష్ట్రంలోని పేదల ఖాతాల్లో ఆ రూ.లక్ష కోట్లు వేస్తావా?' అని సవాల్ చేశారు.
అలా చేయలేకపోతే వెంటనే ఈ పిచ్చి ప్రచారాన్ని ఆపి, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే సీఎం ఈ కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ ద్వారా విమర్శించారు.
Tags:#Telangana#National#Shorts





