Gutta Sukhender Reddy : కేసీఆర్‌పై న‌మ్మ‌కం లేక‌నే పార్టీని వీడుతున్నారు.. శాస‌న మండ‌లి చైర్మ‌న్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

Gutta Sukhender Reddy : కేసీఆర్‌పై న‌మ్మ‌కం లేక‌నే పార్టీని వీడుతున్నారు.. శాస‌న మండ‌లి చైర్మ‌న్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

Gutta Sukhender Reddy :  నల్లగొండ జిల్లా ప్రతినిధి.  క్విక్ టుడే :  బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై నమ్మకం లేకనే నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ కోటరీ వల్లనే టిఆర్ఎస్ కు ఈ దుస్థితి వచ్చింది అన్నారు. 

బిఆర్ఎస్ లో ఎమ్మెల్యే తో రాజకీయాలు సాగుతున్నాయని ఇది మంచి పద్ధతి కాదన్నారు. పార్టీలో గ్రామ, మండల, జిల్లా శాఖలు లేవని సంస్థ గత నిర్మాణం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలు నడపవలసిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సమీక్షలు జరగవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  

పార్టీ విధానాల్లో మార్పు రాకపోతే తీవ్ర నష్టం తప్పదని పార్టీ విధానాల్లో ఓటమిపై సమీక్ష జరగవలసిన అవసరం ఉందన్నారు. తాను పార్టీ మారనని అలాంటి ఆలోచన ప్రస్తావ‌నే లేదన్నారు. నల్లగొండ జిల్లాలో కొందరు లిల్లీ పుట్లను తయారు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ అంతర్గత సమస్యలు, నేతల సహాయ నిరాకరణతోనే ఎంపీ ఎన్నికల్లో తన కుమారుడు అమిత్ పోటీ నుంచి వెనక్కి తగ్గాడని స్పష్టం చేశారు.

21 -2

రాజకీయ నాయకులు అవినీతి అహంకారపూరితంగా వ్యవహరించడంతో ప్రజలు పార్టీకి దూరమైన‌ట్లు తెలిపారు. పల్లి బఠానీలు అమ్ముకునే నేతలు. ఉద్యమకారుల పేరుతో అధికారంలో కూర్చున్న బీఆర్ఎస్ లో చాలామంది నాయకులు కోట్లకు పడగ లెత్తరన్నారు. ఎంతసేపు ఏదుటి వారిపై చాడీలు చెప్పే నేతలే కేసీఆర్ కోటరీలో కొనసాగుతున్నార‌ని అన్నారు.

వారితోనే పార్టీ ప్రజలకు దూరమైంద‌ని అన్నారు. ఈ విషయం కార్యకర్తలు అందరికీ తెలుసు అన్నారు. తనను విమర్శించే బీఆర్ఎస్ నేతలు  ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. త్వరలో వారి బండారం బయటపెడతానన్నారు. గతంలో తాను కేసీఆర్ ఇచ్చిన మంత్రి పదవి హామీ తోనే బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు. కానీ కెసిఆర్ ఆ మాట నిలబెట్టుకో లేదన్నారు.

ప్రస్తుతం తాను ఏ పార్టీతో సంబంధం లేని రాజ్యాంగబద్ధమైన శాసనమండలి చైర్మన్ హోదాలో ఉన్నానన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్సీల అన‌ర్హతకు సంబంధించి ఫిర్యాదులను రాజ్యాంగం ప్రకారం న్యాయ‌ నిపుణుల సలహాలతో నిష్ప‌క్ష‌పాతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు.

21 -3

ప్రస్తుతం కాంగ్రెస్ పాలనపై ప్రజలలో భారీ అంచనాలు ఉన్నాయని ఎన్నికల్లో అనేక హామీలు ఇవ్వడం ఖజానా ఖాళీగా ఉండటం కనీసం ఏడాదిపాటైన ప్రభుత్వానికి సమయం ఇవ్వవలసి ఉంటుందన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్న ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయకపోతే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోక‌ తప్పదు అన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?