శివ్వంపేట ఏప్రిల్ 17 (క్విక్ టు డే న్యూస్):- మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని దొంతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ బుద్ధుల బిక్షపతి తండ్రి చెన్నయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకొని, ప్రముఖ సంఘసేవకులు, మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తన సొంత నిధుల నుంచి రూ.పది వేల రూపాలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.అలాగే అదే గ్రామానికి చెందిన బుద్ధుల రాములు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఘటనలో కూడా పబ్బ మహేష్ గుప్త మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.ఐదు వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కోదాస్ సత్యనారాయణ, మగ్దుంపూర్ మాజీ సర్పంచ్ సోము అశోక్, మల్లుపల్లి మాజీ సర్పంచ్ గ్యాదరి శ్రీనివాస్, ఎండీ లాయక్, పిట్ల సత్యనారాయణ, కుమ్మరి కృష్ణ, గంగం నరేందర్, వంజరి, రాహుల్, చాకలి దశరథ, మేస్త్రి వెంకటేష్, కంచుగారి శ్యామ్, కోదాస్ నర్సింలు, పిట్ల నవీన్, కత్తి గిరిబాబు, షేక్ సాబీర్, కుమార్, పాలాట సురేష్, మంగలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
