Paddy Crop: వరిని ఎక్కువగా పండించే దేశాలు ఏవో తెలుసా..? భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే?
అన్నం లేనిదే మను గడ లేదు.కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నాన్ని దైవంతో కొలుస్తారు. ప్రస్తుతం బియ్యాన్ని విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడకంతో తయారు చేస్తున్నారు. తద్వారా ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యానికి గురవాల్సి వస్తుంది. ప్రస్తుతం అందరూ కూడా పాతకాలంనాటి సేంద్రీయ పంటల ఆహారం తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే సేంద్రియ పంటల దొరలు ఎక్కువగా ఉండడంతో ఇప్పటికీ రసాయని ఎరువులతో పండించిన వరి ధాన్యాన్ని అన్ని బియంగా మార్చి ప్రతి ఒక్కరు తింటున్నారు. మన భారతదేశంలో ఇప్పటికే 90 శాతం మంది బియ్యంతో చేసిన అన్నాన్ని ఆహారంగా తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది కచ్చితంగా నిజమే అని చెప్పాలి. ఎంతటి ధనవంతులైన సరే లేదా పేదవాళ్ళైనా సరే ఖచ్చితంగా రోజులు రెండు పూటలైన సరే అన్నాన్ని తినాల్సిందే.
కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికి మూడు పూటలా కూడా అన్నం తింటున్నారు. అన్నం తినకపోతే చాలామందికి నిద్ర కూడా పట్టదు. ఇక మన దేశంతో పాటు ప్రపంచంలో అన్నం ఎక్కువగా తీసుకున్న దేశాలు కూడా చాలా ఉన్నాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా లేదా వేడుకైనా సరే అన్నం,సాంబార్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇక హోటల్లో అయితే ఫ్రైడ్ రైస్ లంటూ లేదా బిర్యానీ రైస్ అంటూ ఏదో ఒక పేరుతో బియ్యాన్ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు.
మొదటి స్థానంలో చైనా:-
ఇక ప్రపంచంలోకెల్లా అన్నాన్ని ఎక్కువగా తినే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే అక్కడ వరిని ఎక్కువగా పండిస్తారు కాబట్టి. ప్రపంచంలో బిఎంలో 30% చైనాలో ఉత్పత్తి అవుతుండడం ఒక కొత్త చరిత్ర అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చేయనీయులు ఎక్కువగా బియ్యంతో చేసిన అన్నం తింటారు కాబట్టి. కాబట్టి మనం చైనాకి వెళ్ళినా లేదా చైనా వంటలు ఏమని అడిగినా కూడా ప్రతి ఒక్క వాటిలో కూడా బియ్యం అనేది ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టే చైనా అనేది వరి పండించే దేశాల్లో అలాగే అన్నాన్ని ఎక్కువగా తినే దేశాల్లో మొదటి స్థానంలో ఉంది.
రెండవ స్థానంలో భారతదేశం :-
మన భారతదేశంలో ఎక్కువగా వరి పండిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎక్కువగా అన్నమే తింటారు. ముఖ్యంగా ఎక్కువగా దక్షిణ భారతీయులు బియ్యంతో చేసిన అన్నం తింటారు. ఇక ఈ దక్షిణ భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే సన్న బియ్యం మాత్రమే తింటారు. తమిళనాడు, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలో దొడ్డు బియ్యం ఎక్కువగా తింటారు. ఇక ఉత్తర భారతదేశానికి వస్తే ఎక్కువగా గోధుమలతో చేసిన చపాతీలు మరియు జొన్నలు అలాగే చిరుధాన్యాలు ఆహారంగా తింటారు.
ఇకపోతే మూడో స్థానంలో ఇండోనేషియా ఉంది. ఇక నాలుగో స్థానంలోబంగ్లాదేశ్ నిలిచింది. ఇక తర్వాతి స్థానాల్లో వియత్నాదేశం అలాగే ఫిలిప్స్ మరియు థాయిలాండ్ దేశాలు ఉన్నాయి.